న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.45 పెరిగి రూ.44,481కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,436 వద్ద ముగిసింది. వెండి కూడా ఇవాళ స్వల్ప పెరుగదలను నమోదుచేసింది. ఢిల్లీలో మార్కెట్లో కిలో వెండి రూ.116 పెరిగి రూ.66,740కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,624 వద్ద ముగిసింది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,730, ఔన్స్ వెండి ధర 26.11 పలికింది.