ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ డ్రగ్ రాకెట్ను అధికారులు చేధించారు. డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ఇద్దరిని వారి ఇండ్లపై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందం వారిని అరెస్ట్ చేసింది. అంధేరి వెస్ట్లోని వారి నివాసాల నుంచి రూ 2.10 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. వారి నుంచి పలు విదేశీ కార్లు, విదేశీ కరెన్సీలను ఎన్సీబీ అధికారులు సీజ్ చేశారు.
తాము అరెస్ట్ చేసిన ఇద్దరు డ్రగ్ రాకెట్ నిర్వాహకులను శనివారం కోర్టులో హాజరు పరుస్తామని ఎన్సీబీ ముంబై జోన్ జోనల్ డైరెక్టర్ పేర్కొన్నారు. నిందితులు ఇద్దరిని షారుక్ ఖాన్, షాదాబ్ షేక్లుగా గుర్తించామని, కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోనే ఈ డ్రగ్స్ తయారవుతున్నాయని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా ఆచూకీ పసిగట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.