అహ్మదాబాద్: కోల్కతా నైట్రైడర్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. పంజాబ్ కింగ్స్తో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 124 పరుగుల ఛేదనలో రాహుల్ త్రిపాఠి(41: 32 బంతుల్లో 7ఫోర్లు), ఇయాన్ మోర్గాన్(47 నాటౌట్: 40 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదన ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలినా కోల్కతా జోరు ఎక్కడా తగ్గలేదు. మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్నందించాడు. తొలుత పంజాబ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో బౌలర్లు కీలకపాత్ర పోషించడంతో లక్ష్య ఛేదన సులువైంది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. మయాంక్ అగర్వాల్(31: 34 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్(19), క్రిస్గేల్(0), దీపక్ హుడా(1), నికోలస్ పూరన్(19), హెన్రిక్స్(2), షారుక్ ఖాన్(13) నిరాశపరిచారు. ప్రసిధ్ కృష్ణ మూడు వికెట్లు తీయగా పాట్ కమిన్స్, సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.