ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో మృతుల సంఖ్య 63కు చేరింది. 150 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్ ఎక్స్ప్రెస్, సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. అయితే, పట్టాలు తప్పిన సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ రైలును.. మిల్లట్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన 29 గంటల తర్వాత రైల్వే ట్రాక్ను మళ్లీ పునరుద్దించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.