లాక్డౌన్ విధించాలి
వాషింగ్టన్, మే 4: కరోనా రెండో దశ ఉద్ధృతితో భారత్లో పరిస్థితి చాలా భయానకంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడు, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తాత్కాలిక దవాఖానలు నిర్మించాలని, దీనికి సైన్యంతోపాటు అన్ని వనరులను వినియోగించుకోవాలని సూచించారు. భారత్కు ఇతర దేశాలు వైద్య పరికరాలు, ఔషధాలనే కాకుండా తమ సిబ్బందిని కూడా పంపించి సహాయం అందించాలని కోరారు. భారత్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే దేశవ్యాప్త కొన్ని వారాల పాటు లాక్డౌన్ విధించాలని సూచించారు.