అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 368 కరోనా కేసులు నమోదయ్యాయి. 263 మంది చికిత్సకు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 8,93,734కు చేరింది. 8,84,357 మంది చికిత్సకు కోలుకోగా.. మరో 2,168 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు 7,189 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 31,138 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,47,36,326 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.