నల్లగొండ : అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 16 తులాల బంగారం, 40 తులాల వెండి రికవరీ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్ది తెలిపారు. శనివారం నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలను వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకునే తిమ్మసముద్రం శివ అలియాస్ వంశీ, అలియాస్ నందా అలియాస్ నందు వరస దొంగతనాలకు పాల్పడే వాడని తెలిపారు.
లాక్ డౌన్ విధి నిర్వహణలో భాగంగా శనివారం నల్లగొండ టూ టౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన శివను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన దొంగతనాలు ఒప్పుకున్నాడని వివరించారు. శివ స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడెపల్లి.
కాగా, నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు నల్లగొండ వన్ టౌన్, నల్లగొండ రూరల్, నకిరేకల్, నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు దొంగతనం కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.
కేసు విచారణలో సమర్ధవంతంగా పని చేసిన టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్.ఐ. నర్సింహా, సిబ్బంది శంశుద్దీన్, శంకర్, బాలకోటి తదితరులను ఆయన అభినందించారు.
ఇవి కూడా చదవండి..
ఘరానా దొంగను అరెస్ట్ చేసిన కోరుట్ల పోలీసులు
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం : మంత్రి సత్యవతి
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
టీఆర్ఎస్లోకి 50 మంది బీజేపీ నాయకులు