వాషింగ్టన్: అమెరికా చేరిన భారతీయ ప్రయాణికుడి లగేజ్లో ఆవు పేడతో చేసిన రెండు పిడకలను విమానాశ్రయంలోని కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. వాషింగ్టన్లోని డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 4న ఈ ఘటన జరిగింది. భారత్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం నుంచి కొంత మంది భారతీయ ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) సిబ్బంది ప్రయాణికుల లగేజ్ను తనిఖీ చేశారు. ఒక భారత ప్రయాణికుడి సూట్కేస్లో రెండు పిడకలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పిడకలను వంటకు వినియోగిస్తారు. అయితే పశువులకు సోకే ఫుట్ అండ్ మౌత్ రోగం (ఎఫ్ఎండీ) పిడకల ద్వారా వ్యాపించే అవకాశం ఉన్నది. ఈ వ్యాధి పశువులకు తర్వగా వ్యాపించి ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తుంది. దీంతో పశువుల్లో ఈ రోగాన్ని గుర్తిస్తే అంతర్జాతీయ పశు వ్యాపారానికి నష్టం వాటిల్లుతుంది. కాగా, 1929 నుంచి తమ దేశం ఎఫ్ఎండీ రహితమని అమెరికా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోగ వ్యాప్తికి దారి తీసే పికడలతో సహా అన్నింటిని ఆ దేశం నిషేధించింది.