బెంగళూరు: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్కు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాధాన్యతా క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కొవిడ్ -19 వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప ప్రకటించారు. కొవిడ్ థర్డ్ వేవ్పై ఆయన ఇవాళ నిపుణుల కమిటీతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితికి సంబంధించి వారి నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు.
రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభానికి సంబంధించి కూడా వారితో చర్చించినట్లు యెడియూరప్ప తెలిపారు. పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి సంబంధించి నిపుణుల కమిటీ పలు సిఫార్సులు చేసిందని యెడియూరప్ప తెలిపారు. వారి సూచనల ప్రకారమే ఉపాధ్యాయులకు, టీచర్లకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.