హైదరాబాద్: రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగారెడ్డి జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం మార్కెట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూకాల్లో భారీగా తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు వ్యాపారులపై కేసు నమోదుచేశారు. ఇకపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని, తూకాల్లో మోసాలను ఎట్టిపరిస్థితుల్లో సహించమని అధికారులు స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..