కరోనా సరిఫ్టికెట్లను దేశాలు పరస్పరం గుర్తించాలి: మోదీ
వాషింగ్టన్, సెప్టెంబర్ 22: వ్యాక్సిన్ సర్టిఫికెట్లను దేశాలు పరస్పరం గుర్తించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని సరళతరం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కొవిడ్ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ దేశానికి వచ్చే భారతీయులపై బ్రిటన్ విధించిన ఆంక్షల నేపథ్యంలో మోదీ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా పర్యటనకు మోదీ
ప్రధాని మోదీ బుధవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 25వరకు ఆయన పర్యటిస్తారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి, జపాన్, ఆస్ట్రేలియాతో సంబంధాలను పటిష్ఠం చేసుకోవడానికి ఇది మంచి సందర్భమని ట్విట్టర్లో మోదీ పేర్కొన్నారు. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ భేటీ అవుతుండటం ఇదే తొలిసారి. క్వాడ్ నేతలతోనూ సమావేశం కానున్నారు. ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు.