ఆదిలాబాద్ జిల్లాలోని 14 కేంద్రాల్లో ఏర్పాట్లు
కొవిన్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలంటున్న అధికారులు
ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం
ఆదిలాబాద్, మార్చి 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. మొదటివిడుతలో కరోనా నియంత్రణలో భాగంగా సేవలందిస్తున్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారికి టీకా వేశారు. జిల్లావ్యాప్తంగా 10,500 మంది ఫ్రంట్లైన్ వారియర్స్కు రెండు డోస్లు వేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యసిబ్బంది, మున్సిపల్, పంచాయతీశాఖ, పోలీ సు సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. రెండో విడుతలో 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లుదాటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా టీకా పంపిణీ జరుగుతుండగా, ఇప్పటి వరకు 19,000 మందికి టీకా వేసినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సిన్తో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయని మొదటగా ముందుకురాని వారు ఇప్పుడు టీకా వేసుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో ప్రతి రోజూ 400 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.
ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటినవారికి..
జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం 14 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. రిమ్స్ పీపీ యూనిట్, యూపీహెచ్సీ పూత్లీబౌలి, యూపీహెచ్సీ శాంతినగర్, యూపీహెచ్సీ హమాలీవాడ, యూపీహెచ్సీ కుర్షీద్నగర్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇంద్రవెల్లి, తాంసి, బేల, జైనథ్, ఇచ్చోడ, తలమడుగు, కమ్యూనిటీ దవాఖానలు నార్నూర్, బోథ్, ఉట్నూర్ టీకా వేయనున్నారు.టీకాకు అర్హులైన వారు తమ వివరాలను కొవిన్యాప్లో నమోదుచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యాప్లో నమోదు చేసుకునే అవకాశం లేని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నేరుగాఆధార్కార్డుతో వస్తే పీహెచ్సీకి వస్తే సిబ్బంది యాప్లో వివరాలను నమోదు చేసి వ్యాక్సిన్ ఇస్తారని వైద్యాధికారులు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ అర్బన్, మార్చి 29 : జిల్లాలోని 19 మండలాల్లో దాదాపు 2 లక్షల మంది 45 ఏళ్ల వయస్సున వారు ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరందరి కోసం జిల్లాలోని 17 పీహెచ్సీలు, 3 అర్బన్ పీహెచ్సీలు, 1 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కరోనా టీకాను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రతి పీహెచ్సీలో ఐదుగురు సిబ్బందికి శిక్షణను సైతం ఇప్పించారు. జిల్లాలో 11000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 8000 మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. రెండో డోస్లో దాదాపు 5000 మందికి పైగా ఫస్ట్ డోస్ వేశారు. ప్రతి రోజూ జిల్లాలో 250 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఏప్రిల్ 1 నుంచి వీటిసంఖ్య 1000-1500 కు చేరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో ఆనందోత్సహాల మధ్య హోలీ వేడుకలు
హోలీ వేడుకల్లో అపశ్రుతి.. బాలుడు మృతి