కోపాన్ని మనుస్సులో పెట్టుకున్నారు… అదను కోసం ఎదురు చూశారు… సమయం దొరకగానే అటాక్ చేసి చంపేశారు. తెల్లవారుజామున నగరంలో మూడు హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఒక హత్య నడిరోడ్డుపై పట్టపగలు జరుగగా.. మరో రెండు హత్యలు ఇండ్లలో జరిగాయి. అయితే.. ఈ హత్యలన్నీ వ్యక్తిగత కక్షలతోనే చోటుచేసుకున్నాయి. రెండు హత్యలు తెలిసిన వారు చేయగా….మరో హత్యను ప్రత్యర్థి వర్గం చేసిందని ప్రాథమికంగా తెలుస్తోంది. మైలార్దేవ్పల్లిలో అసద్ ఖాన్ను మధ్యాహ్నం 1.30గంటలకు నడిరోడ్డుపై ఆటోతో ఢీకొట్టి.. చిక్కడపల్లిలో ఫుడ్ కోర్టును నిర్వహిస్తున్న సద్నామ్ సింగ్ను తెల్లవారుజాము 12.30 గంటలకు చేతులు కట్టేసి.. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని కార్మికనగర్లో ఓ టైలర్ను మాటు వేసి ఇంట్లోనే చంపేశారు.
ఈ హత్యల సమాచారం అందగానే మైలార్దేవ్పల్లి , చిక్కడపల్లి, బంజారాహిల్స్ పీఎస్ల అధికారులు ఘటనా స్థలాలకు చేరుకుని.. బృందాలుగా ఏర్పడి కీలక క్లూస్ను రాబట్టారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఈ హత్యలన్నీ పథకం ప్రకారం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ మూడు ప్రాంతాల్లో కలకలం రేపింది. బంజారాహిల్స్, ఏప్రిల్ 1: కార్మికనగర్లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. హత్య అనంత రం మృతదేహాన్ని మాయం చేసేందుకు విశ్వ ప్ర యత్నం చేసి.. సాధ్యం కాకపోవడంతో ఫ్రిజ్లో పె ట్టాడు.. సుమారు నాలుగున్నర గంటల పాటు మృ తదేహం వద్దనే ఉండి.. ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. హత్య జరిగిన రెండ్రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..
రహ్మత్నగర్ డివిజన్ కార్మికనగర్లోని విద్యాసాగర్ స్కూల్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో మహ్మద్ సిద్ధిఖ్ అహ్మద్ (38), రుబీనా బేగం దంపతులు అద్దెకు ఉంటున్నారు. వీరికి 12 ఏండ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు. సిద్ధిఖ్ కూకట్పల్లిలోని ఓ కార్జానలో టైలర్గా పనిచేస్తున్నాడు. కాగా.. ఈ నెల 30న రుబీనా పిల్లలను తీసుకుని శ్రీరాంనగర్లోని పుట్టింటికి వెళ్లింది. సిద్ధిఖ్ కూడా అక్కడే భోజనం చేసి రాత్రి 12గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడు. కాగా..గురువారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో సిద్ధిఖ్ ఇంట్లోంచి దుర్వాసనలు వస్తున్నాయంటూ ఇంటి యజమాని జహూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్రిజ్లో సగం పెట్టిన సిద్ధిఖ్ మృతదేహం కనిపించింది.
ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి క్లూస్ టీమ్తో అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సిద్ధిఖ్ ఇంటి కి వచ్చినట్లు తేలింది. అతడు వచ్చిన వెంటనే గుర్తుతెలియని వ్యక్తి ముఖాన్ని పూర్తిగా కవర్ చేసుకుంటూ మంకీ క్యాప్ ధరించి అపార్ట్మెంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున 4.40 గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి బయటకు వెళ్లిన ట్లు తేలింది. బయటకు వచ్చిన హంతకుడు సిద్ధిఖ్ యాక్టివాను తీసుకుని పరారయ్యాడు. దాంతో అతడే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
మంగళవారం రాత్రి 12.10 ప్రాంతంలో సిద్ధిఖ్ మొదటి ఫ్లోర్లోని ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే అక్క డ మాటువేసిన హంతకుడు సిద్ధిఖ్ ఇంట్లోకి వెళ్లిన రెండు నిమిషాల తర్వాత షర్టులో కత్తిని పెట్టుకుని ఇంట్లోకి వెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. లోనికి వెళ్లిన వెంట నే కత్తితో తలవెనక భాగంలో దాడి చేయడంతో పాటు కుప్పకూలిన సిద్ధిఖ్ కడుపుపై నరికినట్లు తెలుస్తోంది. హాల్లో రక్తపు మరకలు కనిపించకుండా శుభ్రం చేసినట్లు స మాచారం. కాగా.. హత్య చేసిన అ నంతరం మృతదేహాన్ని మాయం చేయడానికి కర్టెన్లో మృతదేహాన్ని చుట్టి ఫ్రిజ్లో పెట్టేందుకు య త్నించిన ట్లు తెలుస్తోంది.
సగం మృతదేహం ఫ్రిజ్లోకి వెళ్లినా మిగిలిన భాగం పెట్టేందుకు వీలుకాకపోవడంతో సుమారు నాలుగున్నర గంటల పాటు అక్కడే ఉండి .. తెల్లవారుజామున 4.40 ప్రాంతం లో ఇంట్లోంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తికి సంబంధించిన లావాదేవీలు కానీ, వివాహేతర సం బంధం కానీ హత్యకు కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హత్యకు సం బంధించిన కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని, త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామన్నారు.
పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి వివరాల ప్రకారం… పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటే అసద్ ఖాన్ (48) పాత నేరస్తుడు.. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2018లో అంజద్ ఖాన్ హత్య కేసులో ఏ-1 నిందితుడు. ఇతడిపై పీడీయాక్ట్పై కూడా ప్రయోగించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు.. ఈ క్రమంలో గురువారం అసద్ఖాన్ స్నేహితుడితో కలిసి బైక్పై వట్టేపల్లి నైస్ కేఫ్ రోడ్డులో వెళ్తున్నాడు.
ఇండియానా ఫంక్షన్హాల్ సమీపంలోకి రాగానే.. గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వెంబడించి బైక్ను ఢీకొట్టారు. కిందపడిన అతడిపై నలుగురు కత్తులతో దాడిచేసి.. చంపారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్, ఇన్స్పెక్టర్ నర్సింహ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను గుర్తించడానికి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిక్కడపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యా డు. ఇంట్లోనే చేతులు కట్టేసి దారుణంగా చంపేశారు. చిక్కడపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. చిక్కడపల్లి, సూర్యనగర్లో పంజాబ్కు చెందిన సద్నామ్ సింగ్ (38), బల్జీత్ కౌర్ దంపతు లు.. కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. సద్నామ్ సింగ్ నారాయణగూడలో ఓ ఫుడ్కోర్టు నిర్వహిస్తుండగా, అతడి భార్య గురుద్వారలో పని చేస్తుంది. కాగా… గురువారం మధ్యా హ్నం బల్జీత్ కౌర్ ఇంటికి వచ్చి తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా, భర్త తలుపులు తీయలేదు. కిటికీలో నుంచి చూడగా, భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందిచ్చింది. పోలీసులు క్లూస్ , డాగ్ స్కాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. హతుడు సద్నామ్ సింగ్ వెంట అతడి బంధువు నిషాంత్ సింగ్ ఉన్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా.. బుధవారం రాత్రి 11 గంటలకు సద్నామ్ సింగ్ ఇం టికి రాగా.. 11. 20 నిమిషాలకు నిషాంత్ సింగ్ వచ్చాడు.. ఆ తరువాత నిషాంత్ మళ్లీ బయటకు వెళ్లి మరో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చాడు.. 8 నిమిషాల తరువాత తిరిగి ఆ ముగ్గురు బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.