మమతా బెనర్జీ
డోమ్జుడ్/బాలాగఢ్, ఏప్రిల్ 8: ఓటర్లను మతాల పేరుతో విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉంటానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) పది నోటీసులు జారీ చేసినా తన వైఖరి మారదని స్పష్టం చేశారు. తరచూ హిందూ, ముస్లిం ఓటు బ్యాంకుల గురించి తన ప్రసంగాల్లో ప్రస్తావించే ప్రధాని మోదీకి ఈసీ ఎందుకు నోటీసులివ్వదని ప్రశ్నించారు. ప్రజలను భయపెట్టడానికి కేంద్ర బలగాల్లో కొన్ని దళాలు గ్రామాలకు రావచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మమత వల్లే బీజేపీ బలపడింది
బెంగాల్లో బీజేపీ బలపడటానికి సీఎం మమతా బెనర్జీ అసమర్థతే కారణమని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మైనారిటీకు మమత చేసిందేమీ లేదని అసదుద్దీన్ విమర్శించారు.
ఇవీ కూడా చదవండీ…
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్కు రాకపోకల నిలిపివేత
దివాళా అంచున కాఫీడే.. ఎందుకంటే..!