తిరువనంతపురం: కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత మొదటిసారిగా కేరళలో అత్యధికంగా 32 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాల్లో రాష్ట్రంలో పాజిటివ్ కేస్లోడ్ 255 శాతం పెరిగిందని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు. కేరళలో గత 24 గంటల్లో 21,890 కొవిడ్ కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. బుధవారం వరకు రోజువారీ కరోనావైరస్ గణాంకాలు 32,819 కేసులు, 32 మరణాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,66,646 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
భారతదేశం రోజువారీ మూడు లక్షల కొరోనావైరస్ కేసులను, 2 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఇది మందులు, హాస్పిటల్ పడకలు, మెడికల్ ఆక్సిజన్ కొరతను రేకెత్తిస్తున్నది. అయితే, కేరళలో ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఉండవని వామపక్ష ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆక్సిజన్ లభ్యతను పెంచడానికి బఫర్ స్టాక్లను సృష్టించాలని నిర్ణయించింది.
ఇలాఉండగా, కరోనావైరస్ ఉప్పెనను నియంత్రించడానికి రాష్ట్రం కఠినమైన నిర్ణయాలను ప్రకటించింది. రాష్ట్రంలోని సినిమా హాళ్లు, మాల్స్, జిమ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు నిరవధికంగా మూసివేయాలని ప్రభుత్వం తెలిపింది. అన్ని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలను నిషేధించారు. వారాంతాల్లో అవసరమైన, అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 50 మందికి మించని అతిథులతో 2 గంటల్లో వివాహాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. కాగా, ప్రస్తుతానికి వివాహాలు, సమావేశాలు వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లకు శుభవార్త.. ఇక మాస్కులు లేకుండా తిరగొచ్చు
బ్రెగ్జిట్ తర్వాత వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించిన ఈయూ ఎంపీలు
సుప్రీం జస్టిస్ బ్లాక్ మెయిల్కు పాక్ ప్రభుత్వం విఫల యత్నం: బిలావాల్ భుట్టో
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్ ఛాలెంజ్
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..