ఆర్డీఎస్ వాటాలో చుక్క నీటినీ వదలం : ఎమ్మెల్యే అబ్రహం
అయిజ, మార్చి 30 : ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మంగళవారం అయిజలోని సబ్ మార్కెట్ యార్డులో పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలంపూర్ నియో జకవర్గంలో ఈ ఏడాది 15,375 ఎకరాల్లో పప్పు శనగ సాగు చేశారని, 92 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్, మం త్రి నిరంజన్రెడ్డి సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అలంపూర్, అయిజలో కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పా రు. రూ.5,100 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో సాగు చేసిన ధాన్యం కొనుగోలుకు 6,408 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాణ్యమైన శనగను కొనుగోలు కేంద్రాలకు తర లించి విక్రయించాలని సూచించారు.
చుక్క నీటినీ వదులుకోం..
ఆర్డీఎస్ ఆయకట్టుకు కేటాయించిన నీటివాటా 15.9 టీఎంసీల నీటిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ను అడ్డం పెట్టుకుని తుంగభద్ర జలాలను, ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కుడి కెనాల్ ఏర్పాటు చేసుకుని 4 టీఎంసీలను ఏపీ తరలించేందుకు చర్యలు తీసుకున్నదన్నారు. సీడబ్ల్యూసీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల అనుమతులు లేకుండా ఏపీ మొండి వైఖరితో ఆ ర్డీఎస్ కుడికాల్వ పనులకు శ్రీకారం చుడుతున్న వి షయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీంతో అసెంబ్లీలోనే స్పష్టంగా చెప్పారన్నారు. రా ష్ట్ర జల మండలి అధికారులు, అపెక్స్ కమిటీ, గ్రీన్ ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్రం ప్ర భుత్వం, సుప్రీంకోర్టుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారన్నారు. కుడికాల్వ పనులను న్యా యపరంగా నిలుపుదల చేసేందుకు చర్యలు చేప ట్టామన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 87, 500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్ర భుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. త్వరలోనే తుమ్మిళ్ల పరిధిలో మల్లమ్మకుంట రిజర్వాయర్కు పరిపాలనా అనుమతులు రానున్నాయన్నారు. చి న్నోనిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి ఆర్డీఎస్ కా ల్వకు అనుసంధానం చేసి అదనపు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ రాందేవ్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మన్న, మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, విండో అధ్యక్షుడు మధుసూధన్రెడ్డి, ఏడీఏ సక్రియా నా యక్, కమిషనర్ వేణుగోపాల్, ఏవో శంకర్లాల్, టీఆర్ఎస్ నేత నర్సింహారెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
ముఖంపై గోధుమరంగు మచ్చలు.. బైబై చెప్పేందుకు చిట్కాలు
ఢిల్లీ దవాఖానలో వైద్య అద్భుతం.. 30 ఏండ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ