హైదరాబాద్: గొంతులో సమస్య ఉంటే ఎవరికైనా చాలా చిరాకుగా ఉంటుంది. ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఎదుర్కొని ఉంటారు. గొంతులో సాధారణంగా గరగర, నొప్పి, మంట లాంటి సమస్యలు ఒకేసారిగానీ, ఒక్కొక్కటి ఒక్కోసారి గానీ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి కొంచెం చల్లటి నీళ్లు తాగినా, ఏదైనా చల్లటి పదార్థం తిన్నా వెంటనే గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే ఈ గొంతు సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి పనిచేసే చిట్కా ఏందో ఇప్పుడు తెలుసుకుందాం..!
చిట్కా: ఒక పాత్రలో పావులీటర్ నీళ్లు పోసి దాన్ని పొయ్యిమీద పెట్టాలి. ఆ నీళ్లలో చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, పదివరకు తులసి ఆకులు, పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. ఆ మరిగించిన నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగాలి. అయితే, డయాబెటిస్ ఉన్నవాళ్లు మాత్రం తేనె కలుపకుండా తాగాలి. ఈ చిట్కా పాటిస్తే క్షణాల్లోనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో