టాలీవుడ్లో కరోనా విలయతాండవం చేస్తుంది. గత ఏడాది పెద్దగా సెలబ్రిటీల జోలికి పోని కరోనా ఈ సారి మాత్రం వారినే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడగా, తాజాగా పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరు పరీక్షలు చేయించుకోండి. మీరు చూపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు ధన్యవాదాలు. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి అంటూ పూజా పోస్ట్లో పేర్కొంది.
అల వైకుంఠపురములో చిత్రంలో బుట్టబొమ్మగా కనిపించి అలరించిన పూజా హెగ్డే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. ఇటీవల ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అమ్మడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలోను నటించింది. తమిళ దళపతి విజయ్ 65వ సినిమాలోనూ హీరోయిన్గా ఎంపికైంది. ఇక హిందీలో రణ్వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సర్కస్లోనూ తళుక్కున మెరవనుంది.