నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలీస్ పరిశీలకుడిగా ఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
బుధవారం సునీల్ కుమార్ మీనా జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా డీఐజీ ఏవీ రంగనాథ్, అదనపు ఎస్పీ నర్మద ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి ఇప్పటివరకు పోలీస్శాఖ చేపట్టిన చర్యలు, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది వివరాలు ఆయనకు వివరించారు.
ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి