హైదరాబాద్: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను బహ్రెయిన్లో ఘనంగా నిర్వహించారు. నాలుగున్న కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన కేసీఆర్ పుట్టినరోజును ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్లో అధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రటరీ అన్నారం సుమన్ మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణను కోట్లాడి సాధించి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఏడున్నర ఏండ్లుగా నిరుపేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక ప్రధాని మోదీ విషంచిమ్ముతున్నారని విమర్శించారు. గత ఏడున్నరేండ్లుగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్కపైసా ఇవ్వకున్నా తామే ఇస్తున్నట్లు గోబెల్స్ ప్రసారం చేసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్కు బహ్రైన్ ఎన్ఆర్ఐ టీఅర్ఎస్ పక్షాన హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.