జైపూర్ : రాజస్థాన్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన రెండు స్థానాలను కోల్పోయింది. మరో స్థానాన్ని చావుదప్పి కన్ను లొట్టబోయిన చందంగా కాపాడుకున్నది. గతంలో బీజేపీ ఖాతాలో ఉన్న సహాదా, సుజన్ఘడ్ స్థానాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడగా.. రాజసమంద్ స్థానం ఒక్కదాన్ని నిలుపుకుని బీజేపీ పరువు కాపాడుకుంది.
సహాదా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రీ దేవి త్రివేది విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి అయిన డాక్టర్ రతన్లాల్ జాట్పై 18,088 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సుజన్ఘడ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ మేఘవాల్ తన సమీప ఆర్ఎల్పీ అభ్యర్థి సీతారాం నాయక్పై 15,226 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఖేమారాం మేఘవాల్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక రాజసమంద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దీప్తీ మహేశ్వరి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి తన్సుఖ్ బోహ్రాపై 2,715 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ దూసుకుపోవడం రాష్ట్రంలో మా పార్టీ పనితీరుకు నిదర్శనమని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
జార్ఖండ్ ఉప ఎన్నిక : మధుపూర్లో జేఎంఎం ఆధిక్యం
ఉత్తరాఖండ్ ఉప ఎన్నిక : బీజేపీ ముందంజ
ఎంపీ ఉప ఎన్నిక : దమోహాలో కాంగ్రెస్ ముందంజ
యూపీలో వారాంతపు లాక్డౌన్ సమయం పొడగింపు
అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ
ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
పుదుచ్చరిలో ముందంజలో ఎన్డీఏ కూటమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..