హైదరాబాద్ : బంగారంతో కూడిన బ్యాగ్ను పొగొట్టుకున్న మహిళకు పోలీసులు వెతికితెచ్చి తిరిగి అప్పగించారు. ఈ ఘటన నగరంలోని చాంద్రాయణగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాదత్నగర్కు చెందిన సబియా బేగం అనే మహిళ చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని ఘాజిమిల్లట్ కాలనీలో నివాసం ఉండే తమ బంధువుల ఇంటికి మంగళవారం వచ్చింది. కాగా ఆటోలో బంధువుల ఇంటికి చేరిన ఆమె దిగే సమయంలో బ్యాగును మరచిపోయింది. అందులో ఒక తులం బంగారం, నగదు, మొబైల్ ఫోన్ ఉన్నాయి. బ్యాగ్ను ఆటోలోనే మర్చిపోయినట్లుగా గుర్తించిన మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. సీసీ టీవీ కెమెరాల సహాయంతో పోలీసులు ఆటోను గుర్తించారు. తక్షణమే వెళ్లి ఆటోలోని బ్యాగ్ను స్వాధీనం చేసుకుని బాధిత మహిళకు అప్పగించారు. చాంద్రాయణగుట్ట పోలీసులు మహిళ కృతజ్ఞతలు తెలిపింది.