వీణవంక, జూలై 5 : ‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్టు బండి సంజయ్ పాదయాత్రకు బయలుదేరుతడట. హుజూరాబాద్ ఎన్నిక కోసమే ఈ పాదయాత్ర డ్రామా. దానికి పెట్టుకున్న పేరు ప్రజాస్వామ్య తెలంగాణ అట. నేను అడుగుతున్న బండి సంజయ్.. నువ్వు చేయాల్సిన పాదయాత్ర తెలంగాణలో కాదు ఢిల్లీలో. ప్రజాస్వామ్య భారత్ కోసం మోడీ మీద చేయాలి. దళితులు, గిరిజనులు, మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అమిత్షా మీద చేయాలి’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కిష్టంపేటలో ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా అవగాహన సదస్సుకు బాల్క సుమన్ మాట్లాడారు. అసత్య ప్రచారాలను అడ్డాగా చేసుకున్న బీజేపీ ఫేక్ న్యూస్ను సమర్థంగా తిప్పికొట్టి హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగిరేలా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.