యాదగిరిగుట్ట రూరల్, మే1: ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే అందరితో సమానంగా ఆడిపిల్లలను ఎదగనీయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రా రంభించారని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీంద ర్ గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం, మాసాయిపేటతో పాటు పలు గ్రామాల్లోని లబ్ధిదారులకు మం జూరైన కల్యాణలక్ష్మీ చెక్కులను శనివారం మల్లాపురంలో అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ఓ వరమన్నారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం నిర్విరామంగా, కొనసాగ డం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీశైలం, జడ్పీటీసీ అనురాధ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు వెంక టయ్య, మాసాయిపేట సర్పంచ్ సువర్ణ, ఎంపీటీసీ విజయ, కార్యదర్శి సోమిరెడ్డి, వెంకటయ్య, సురేశ్రెడ్డి పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం): మండలంలోని కఫ్రాయిపల్లి, టీ.రేపాక, ర హీంఖాన్పేట, మోదుగుబావిగూడెం గ్రామాల్లోని పేదింటి ఆడ బిడ్డలకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం ఆయా గ్రామాల సర్పంచ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలోసర్పంచ్లు వరలక్ష్మి, ప్రమీల, వెంకట మ్మ, మాధవి, ఆర్ఐ. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.