బీజింగ్ : కరోనా మహమ్మారితో పోరాటానికి భారత్ తో కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ భారత్ ను వణికిస్తున్న నేపథ్యంలో అన్ని విధాలా ఆపన్న హస్తం అందిస్తామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు.
భారత్ లో కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో ఉత్పన్నమైన పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని, చైనీయుల పక్షాన..తాను సైతం సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం, ప్రజల పట్ల సానుభూతి కనబరుస్తున్నామని లేఖలో జిన్పింగ్ పేర్కొన్నారు. ప్రజలు పరస్పర సహకారంతోనే భవిష్యత్ నిర్మించుకుంటామని, సహకారంతోనే ప్రపంచ దేశాలు మహమ్మారిని మట్టికరిపిస్తాయని అన్నారు.