రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో వైకుంఠ ధామాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ. 200 కోట్లు ప్రతిపాదించింది. హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో వీటిని నిర్మిస్తారు. ప్రహరీ, విద్యుత్ దీపాలు, మొక్కలు, వేయిటింగ్ రూం, ఆస్తికలు నిల్వ చేయడానికి, నీటి సౌకర్యం, రోడ్డు ఉండేలా నిర్మించనున్నారు. నగరాల్లో ఇప్పుడున్న వాటికి అదనంగా మరికొన్నింటిని నిర్మిస్తారు.