పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, ఏప్రిల్ 7 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన పలువురికి బుధవారం హన్మకొండలోని తన నివాసంలో రూ.5.62 లక్షల విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్య తరగతి వారికి వైద్యాన్ని చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం శ్రీ భవానీకుంకుమేశ్వర ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముద్రించిన నూతన పంచాంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రూ.3కోట్లతో చర్చిలు, మసీద్ల అభివృద్ధ్ది
నియోజకవర్గంలోని చర్చిలు, మసీద్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే తన నివాసంతో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గంలోని చర్చిలు, మసీద్ల అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఈ నిధుల్లో రూ.50 లక్షలతో పరకాల పట్టణంలో షా దీఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.కోటి తో ఐదు మసీద్లకు ప్రహరీ నిర్మాణం, మరమ్మతులు చేపట్టడంతో పాటు 23 ఖబ్రస్థాన్ ప్రహరీలు నిర్మించడం, రూ.1.5 కోట్లతో నియోజకవర్గంలోని చర్చిలకు ప్రహరీలు నిర్మించి మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
‘ఎఫ్సీఐ గోడౌన్ల లూటీకి సమయం ఆసన్నమైంది’
రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేసిన హోంమంత్రి అమిత్ షా..!