అభినందించిన క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ హాకీ అసోసియేషన్ కార్యవర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా, విజయ్కుమార్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను గురువారం వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో హాకీ ఆటకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నా వంతు సహాయ, సహకారాలు అందిస్తాను. వచ్చే నెలలో హైదరాబాద్లో తొలిసారి జరుగబోతున్న జాతీయస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీకి సహకరిస్తాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముకేశ్ కుమార్, విజయ్కుమార్తో పాటు కోశాధికారి భాస్కర్రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షుడు కాశి తదితరులు పాల్గొన్నారు.