జెరూసలెం : ఇజ్రాయెల్పై చైనా హ్యాకర్లు భారీ సైబర్ దాడికి (Cyber attack) పాల్పడ్డారు. ఆ దేశానికి చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడి చైనాకు చెందిన హ్యాకర్లు జరిపినట్లు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘ఫస్ట్ ఐ’ వెల్లడించింది. పలు కంపెనీల ఫైనాన్స్, టెక్నాలజీ, వ్యాపారానికి సంబంధించిన డాటాను హ్యాకర్లు దొంగిలించారని తెలిపింది. ఇందులో యూజర్ డాటా కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నది.
అందిన సమాచారం మేరకు.. చైనా సైబర్ గ్రూప్ యూఎన్సీ 215 ఈ దాడికి పాల్పడింది. మైక్రోసాఫ్ట్ షేర్పాయింట్లోని పాత లూప్ హోల్ను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. దీని కోసం వారు FOCUSFJORD, HYPERBRO అనే మాల్వేర్ను వాడారు. ఈ దాడికి ఇరాన్ దేశానిదే బాధ్యత అని నెపం మోపేందుకు కూడా హ్యాకర్లు ప్రయత్నించారు. ఈ దాడిలో యూఎన్సీ 215 కొత్త టెక్నిక్, పద్ధతులను అనుసరించింది. ఈ దాడిపై ఇజ్రాయెల్ దర్యాప్తు చేస్తుందని భావించిన హ్యాకర్లు.. ఇరాన్పై అనుమానం వచ్చేలా చేసేందుకు సాక్ష్యాలను వదిలిపెట్టారు. ఇరాన్లో సాధారణంగా హ్యాకర్లు ఉపయోగించే టూల్స్ను ఇక్కడ ఈ హ్యాకర్లు ఉపయోగించారు. హ్యాకర్లు ఒకరితో మరొకరు ఫార్సీలో మాట్లాడుకున్నట్లుగా తెలుస్తున్నది.
ఐసీసీ ర్యాంకింగ్స్లో పైకి బుమ్రా.. కిందికి కోహ్లీ
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
ఇవి ఎకో ఫ్రెండ్లీ బూట్లు.. ఉత్పత్తి ఎక్కడో తెలుసా..?
నష్టాలు పెరుగుతున్నా.. వేగం పుంజుకుంటున్న జోమాటో
ఆఫ్ఘాన్లో దిగజారిన పరిస్థితి : ఇండియా తిరిగొచ్చిన 50 మంది
డయాబెటిస్ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
ఇస్రో మరో మైలురాయి.. ఆకాశంలో మన ‘కన్ను’
చిన్నారిని చంపేసిన ఆన్లైన్ చదువు
చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..