పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
117 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ
కులకచర్ల, మే 26: కల్యాణలక్ష్మి పేదలకు వరంలా మారిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో 117 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల వివాహాలు చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి డబ్బు లు నేరుగా వివాహిత తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్య మ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, ఎంపీటీసీ రాంలాల్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహులు, తాసిల్దార్ అశోక్కుమార్ పాల్గొన్నారు.
భౌతికదూరం పాటిస్తూ కొనుగోళ్లు చేయాలి
పరిగి, మే 26 : భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రజలకు సూచించారు. బుధవారం ఉదయం పరిగిలోని కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కూరగాయలు కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలన్నారు. గురువారం నుంచి కూరగాయల దుకాణాల మధ్య దూరం ఉండేలా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. మార్కెట్కు తీసుకువచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల తూకం అవకాశం కల్పించాలని పోలీసులకు ఎమ్మె ల్యే సూచించారు. ఆంక్షల సడలింపు సమయంలో ని బంధనలు పాటించాలన్నా రు. ప్రధాన రహదారి పక్క న చేపల విక్రయానికి అవకాశం కల్పించాలని మత్స్యకారులు ఎమ్మెల్యేను కోరా రు. ఈ సందర్భంగా పరిగి మార్కెట్యార్డులో కూరగాయల విక్రయదారులు, కొ నుగోలుదారులకు ఎమ్మెల్యే మాస్కులు అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కె. అరవిందరావు, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు వేముల కిరణ్, బద్రుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు వి.యాదయ్య, బి.రవికుమార్, నరేశ్ ఉన్నారు.
ప్రశాంతతకు నిలయాలు దేవాలయాలు
పూడూరు, మే 26 : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం పూడూరు మండలం రాకంచర్ల శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం కొవిడ్ నిబంధనలను పాటిస్తూ దేవాలయ కమిటీ చైర్మన్ జె.నర్సింహులు ఆధ్వర్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావంతో ఆనవాయితీగా వస్తున్న పూజలను మాత్రమే అర్చకులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దేవుడి దయతో కరోనా మహమ్మారి అంతరించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఆలయ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బిక్యానాయక్, అర్చకులు భీమాచారి, నర్సింహాచారి ఉన్నారు.