బీజింగ్: తైవాన్ను దేశంగా పేర్కొన్న జపాన్పై చైనా తీవ్ర నిరసన తెలియజేయడంతోపాటు ఘాటుగా హెచ్చరించింది. పార్లమెంటరీ సమావేశం ముందు రోజు జపాన్ ప్రధాని యోషిహిదే సుగా బుధవారం తైవాన్ను ఒక దేశంగా ప్రస్తావించారు. విదేశాలలో అనుసరించిన కోవిడ్ -19 మహమ్మారి నివారణ వ్యూహాలను చర్చిస్తూ.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తైవాన్ను “ప్రైవేట్ హక్కులపై బలమైన ఆంక్షలు” తీసుకున్న దేశాలుగా సుగా అభివర్ణించారు.
ఈ నేపథ్యంలో జపాన్పై చైనా మండిపడింది. స్వయం పాలిత తైవాన్ను ఒక దేశంగా పేర్కొనడాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తప్పుపట్టారు. తైవాన్తో దౌత్య సంబంధాలు కలిగి ఉండటం లేదా ద్వీపాన్ని ఒక దేశంగా సూచించడం చైనా-జపాన్ సంబంధాలతోపాటు పలు పలు అంశాల ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఇలా మరోసారి జరుగకుండా చూడాలని సూచించారు. తైవాన్ చైనా నుంచి విడదీయలేని ప్రాంతమని, అవసరమైతే బలవంతంగా తిరిగి కలుపుకుంటామని ఈ సందర్భంగా చైనా హెచ్చరించింది.