రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా గురించి దేశం అంతా ఆసక్తిగా వేచి చూస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలకు సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య త్రిబుల్ ఆర్ సినిమా నిర్మిస్తున్నారు. ఈ వైరస్, లాక్ డౌన్ ఇవన్నీ లేకపోయి ఉంటే ఈ పాటికే సినిమా విడుదలై ఉండేది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఏదైనా ఒక్క అప్డేట్ తెలిసిన కూడా పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అలాంటి వాళ్లకు ఏకంగా ఫుల్ మీల్స్ పెట్టినంత పని చేశాడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాలు గురించి ఈయన ఓపెన్ అయిపోయాడు.
తాజాగా ఆలీతో సరదాగా షోకి వచ్చిన విజయేంద్ర ప్రసాద్ చాలా విషయాల గురించి చెప్పుకొచ్చాడు. అందులో త్రిబుల్ ఆర్ సంగతులు కూడా ఉన్నాయి. ఈ సినిమా ఎలా వచ్చింది అని అడిగినప్పుడు.. అద్భుతంగా వచ్చింది అంటూ ఆసక్తి పెంచాడు విజయేంద్ర ప్రసాద్. సాధారణంగా ఏ సినిమా చూసినా తనకు నిద్ర వస్తుందని.. కానీ ఇందులో కథ ఏంటో తెలుసు.. ఏం జరుగుతుందో తెలుసు అయినా కూడా కన్నార్పకుండా చూశాను అంటూ సినిమాపై అంచనాలు పెంచేశాడు విజయేంద్రప్రసాద్.
అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం గురించి నోరు జారాడు ఈ సీనియర్ రైటర్.త్రిబుల్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అని తెలిపాడు. ఇద్దరు మంచి వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే కంటి నుంచి నీళ్లు వస్తాయి అంటూ అసలు విషయం బయట పెట్టాడు విజయేంద్ర ప్రసాద్. ఈ సన్నివేశం రాజమౌళి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అని ప్రశంసించాడు.
ఖచ్చితంగా సినిమా చరిత్రలో నిలిచిపోతుంది అని బల్లగుద్ది చెబుతున్నాడు. ఈ సినిమాలో కీలకమైన సన్నివేశం గురించి బయట పడిపోవడంతో ఇప్పుడు దానిపై అంచనాలు మరింత పెరిగి పోయాయి. ఏదేమైనా ఇంత భారీ సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు కొన్ని విషయాలు దాచి పెడితే బాగుంటుంది అని రాజమౌళి సన్నిహితులు చెబుతున్న మాట. కానీ అక్కడ బయట పెట్టింది రాజమౌళి తండ్రి కావడంతో ఎవరు ఏమీ అనలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి..
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!