మహబూబ్నగర్ : స్వాతంత్రోద్యమంలో కరువుల పాత్ర మరువలేనిదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు అన్నారు.
ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మహబూబ్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో కవులు కీలక పాత్ర పోషించారని అన్నారు. తమ అద్భుత కవితలు, సాహిత్యం, పాటల ద్వారా సమాజాన్ని చైతన్యం చేశారని కొనియాడారు.
భారతదేశం 75 ఏండ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమానికి సమాచారశాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి, క్రీడలు యువజన అభివృద్ధిశాఖ జిల్లా అధికారి శ్రీనివాసులు, జడ్పీ సీఈఓ యాదయ్య, గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భాస్కర్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి