షాబాద్, మే 16 : తన పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొక్కలు నాటారు. ఆదివారం నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలం ఎమ్మెల్యే స్వగ్రామం చించల్పేట్లో పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి బిల్వ, కల్పవృక్షం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు వివరించారు.
కరోనా బాధితులకు పండ్లు అందజేత
కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చందనవెళ్లి సర్పంచ్ ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చందనవెళ్లి గ్రామంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య పుట్టినరోజు సందర్భంగా కరోనా బాధితులు, పారిశుధ్య సిబ్బందికి రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, గుడ్లు, శానిటైజర్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా బాధితులకు సామగ్రి అందజేశామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రమీల, గ్రామస్తులు వెంకటయ్య, విష్ణు, మల్లేశ్ పాల్గొన్నారు.
కేక్కట్ చేసిన నాయకులు..
ఎమ్మెల్యే కాలె యాదయ్య పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఆదివారం చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీటీసీ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నాయకులతో కలిసి కేక్కట్ చేశారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కార్యదర్శి ప్రభాకర్, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, మైనార్టీ మండలాధ్యక్షుడు మోసిన్, నాయకులు నరేందర్ గౌడ్, పామెన వెంకటేశ్, యాదిరెడ్డి పాల్గొన్నారు.