న్యూఢిల్లీ: ఫుట్బాల్ అభిమానులారా సిద్ధం కండి! నెల రోజుల పాటు కొత్త ప్రపంచంలో విహరించేందుకు సమాయత్తమవ్వండి. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్ల మధ్య అసలు సిసలు పోరు జరుగనుంది. 11 నగరాలు వేదికలుగా నువ్వానేనా అన్నట్లు జట్లు తలపడబోతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత ఏడాది జరుగాల్సిన యూరోపియన్ చాంపియన్షిప్ టోర్నీ 2021కి వాయిదా పడింది. మొత్తం 24 జట్లు ఆరు గ్రూపులుగా విడిపోయి పోటీపడనున్నాయి. శుక్రవారం మొదలవుతున్న ఈ మెగా టోర్నీలో టర్కీ, ఇటలీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్, జర్మనీ,ఫ్రాన్స్, హంగరీ కలయికతో గ్రూపు-హెచ్..‘గ్రూపు ఆఫ్ డెత్’గా మారింది. ముఖ్యంగా పోర్చుగల్ సూపర్ ైస్ట్రెకర్ క్రిస్టియానో రొనాల్డో అందరి కండ్లు ఉన్నాయి. ప్రత్యర్థులను కంగు తినిపిసూ ్తరొనాల్డో చేసే విన్యాసాలకు ఔరా అనిపించాల్సిందే.