కరోనా మహమ్మారి సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, వారు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా మాస్టర్ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు స్టార్ డైరెక్టర్. కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్ష చేయించుకోగా, పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని చెప్పుకొచ్చాడు. త్వరలోనే మళ్లీ మిమ్మల్ని కలుస్తానని లోకే ష్ పేర్కొన్నారు.
మాస్టర్ చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా, ఇది ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. పొలిటికల్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు లోకేష్ కనగరాజ్