చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి వేళల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజా రవాణా, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలను అనుమతించరు.
ఇక ఆదివారాల్లో రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తారు. నిత్యవసర షాపులు, మెడికల్ షాపులు మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు. రెస్టారెంట్లు ఉదయం 6 నుంచి పది , మధ్యాహ్నం 12 నుంచి 3, సాయంత్రం 6 నుంచి 9 గంటలు మాత్రమే పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసింది.