పుణె: భారత్తో తొలి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 318 పరుగుల లక్ష్య ఛేదనలో సాధించాల్సిన రన్రేట్ తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా ఆడే క్రమంలో చెత్తషాట్లు ఆడి వికెట్లు పారేసుకుంది. శార్దుల్ ఒకే ఓవర్లో ఇయాన్ మోర్గాన్(22), జోస్ బట్లర్(2)లను పెవిలియన్ పంపడంతో భారత్ మ్యాచ్పై పట్టు సాధించింది. 24 ఓవర్ల వరకు లక్ష్యం దిశగా దూసుకెళ్లిన ఇంగ్లాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం సామ్ బిల్లింగ్స్(13), మొయిన్ అలీ(7) క్రీజులో ఉన్నారు. 29 ఓవర్లకు ఇంగ్లాండ్ 5 వికెట్లకు 195 పరుగులు చేసింది.