బీజింగ్, మే 29: చైనాలో మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తున్నది. 1.5 కోట్ల జనాభా గల గాంజావ్ నగరంలో కొత్తగా 20 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి భారత్లో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్ రకం కేసులేనని అధికారులు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ అందరూ ఇండ్లల్లోనే ఉండాలని ఆదేశించారు.