ఉప్పల్/రామంతాపూర్/మల్లాపూర్/చర్లపల్లి/కాప్రా జూలై 10 : పదిరోజుల పాటు నిర్వహించిన పట్టణ ప్రగతిలో పచ్చదనం, పరిశుభత్రకు ప్రాధాన్యత ఇచ్చామని, దీంతోపాటు కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రగతిపథంలో నడిపిస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నాచారంలోని హెచ్ఎంటీనగర్ చెరువు కట్టపై కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్తో కలిసి మొక్కలు నాటారు.హబ్సిగూడ డివిజన్ పరిధిలోని రాంరెడ్డినగర్, వాసవీనగర్లో జరిగిన పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ కక్కిరేణి చేతనా హరీశ్తో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు . మల్లాపూర్లోని మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ ఎన్టీఆర్నగర్, న్యూనర్సింహనగర్ కాలనీలలో కార్పొరేటర్ జె. ప్రభుదాస్, అధికారులతో కలిసి పర్యటించారు.
రోడ్లు, తాగునీటి సమస్య, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, పారిశుధ్య సమస్యలను స్థానికులు కోరిక మేరకు వెంటనే పరిష్కరిం చాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం కాలనీలలో మొక్కలను నాటారు. ఈ సంద ర్భంగా ఆయన కాలనీవాసులతో మాట్లాడుతూ..ప్రతిఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించేవిధంగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, నేతలు మేకల ముత్యంరెడ్డి, ఎర్రం శ్రీనివాస్రెడ్డి, భూపాల్రెడ్డి, నిర్మలారెడ్డి, శ్రీరామ్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. చిలుకానగర్ డివిజన్లోని టీచర్స్కాలనీ, అజమత్నగర్, హైకోర్టుకాలనీ, జాహిద్నగర్లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ పలు శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. పలువురికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, వీబీ.నర్సింహ పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్ బాబానగర్ కాలనీలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అధికారులతో కలిసి మొక్కలను నాటారు. కాలనీ ప్రతినిధులు రాజు, మురళీధర్, రమేశ్బాబు, వెంకటేశ్, అనంత్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తండా వాసుదేవ్గౌడ్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా కాప్రాడివిజన్ కేసీఆర్ మల్లికార్జున్నగర్ బస్తీలో శనివారం కార్పొరేటర్ స్వర్ణరాజు మొక్కలు నాటారు. కాలనీ అధ్యక్షుడు కిరణ్కుమార్ కాలనీ సమస్యలు వివరించి వినతిపత్రం సమర్పించాడు. అనంతరం మాధవపురి, జెనీలియా, శివపురికాలనీల్లో కార్పొరేటర్ పర్యటించి సీసీరోడ్డు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈ అభిషేక్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సుడుగుమహేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి , డీఈ బాలకృష్ణ, ఏఈ సంతోష్కుమార్తో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సోమశేఖర్రెడ్డి, విజయ్కుమార్, సోమయ్యచారి, చంద్రకుమార్, సాంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి, జూలై 10 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చర్లపల్లి డివిజన్లో ఉద్యమంలా మొక్కలు నాటామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తెలిపారు. శనివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, కూరగాయల మార్కెట్, హనుమాన్నగర్ తదితర ప్రాంతాలలో ఏఈ సత్యలక్ష్మి, స్థానికులతో కలిసి ఆమె మొక్కలు నాటి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం ఆమె పలు కాలనీలలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.