గాల్వన్ దాడిపై కామెంట్.. చైనా బ్లాగర్ అరెస్టు

బీజింగ్: గత ఏడాది జూన్ 15వ తేదీన లడాఖ్లో జరిగిన సరిహద్దు ఘర్షణలో తమ సైనికులు కూడా చనిపోయినట్లు ఇటీవల చైనా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణలో మరణించిన నలుగురు ఆర్మీ ఆఫీసర్లకు కొన్ని రోజుల క్రితం వీర పురస్కారాలను అందజేసింది. గాల్వన్ ఘటన వీడియోను కూడా చైనా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోపై 38 ఏళ్ల చైనా బ్లాగర్ ఒకరు అనుచిత కామెంట్ చేశారు. దేశ హీరోలను, అమరులను అమర్యాదపరిస్తే వారిని అరెస్టు చేసే విధంగా రెండేళ్ల క్రితం చైనా ఓ చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం క్యూ అనే బ్లాగర్ను అరెస్టు చేశారు. ఫిబ్రవరి 19న అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు నాన్జింగ్ పబ్లిక్ సెక్యూర్టీ బ్యూరో పేర్కొన్నది. బ్లాగర్ క్యూకు వీబోలో సుమారు 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే అతని అకౌంట్ను ఏడాది పాటు బ్యాన్ చేస్తున్నట్లు ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో ప్రకటించింది.
తాజావార్తలు
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!