న్యూఢిల్లీ, జూలై 19: భారత సరిహద్దుల్లో వేగంగా బలగాలను మోహరించేందుకు వీలుగా చైనా వాస్తవాధీన రేఖ(పీఎల్ఏ) వెంబడి కస్గర్, హోగన్ మధ్యలో శాక్చే ప్రాంతంలో ఓ ఎయిర్ బేస్ను నిర్మిస్తున్నది. గతేడాది ఇరుదేశాల సైన్యం మధ్య ఘర్షణలు, తర్వాత భారీగా సైనిక మోహరింపుల సమయంలో చైనా ఓ నిర్ణయానికి వచ్చింది. వివాదాస్పద ప్రాంతాల్లో చైనా సైన్యం కంటే వేగంగా భారత్ రాగలదని ధ్రువపర్చుకొన్నది. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి మిలిటరీ బేస్లు నిర్మించుకొన్నది. తాజాగా ఎయిర్ బేస్ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసింది. ఈ నిర్మాణాలు, చైనా చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.