ఆసిఫాబాద్ ఏఎస్పీ వైవీ సుధీంద్ర
బురదమడుగు గ్రామంలో పర్యటన
కాలినడకన 8 కిలోమీటర్ల ప్రయాణం
తిర్యాణి, ఏప్రిల్ 29 : ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని ఆసి ఫాబాద్ ఏఎస్పీ వైవీ సుధీంద్ర అ న్నారు. ‘పోలీసులు మీ కోసం’లో భాగంగా మం డలంలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత గ్రా మమై న గోపెర పంచాయతీ పరిధిలోని బురదమడుగు గ్రామానికి 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 కుటుంబాలు, 41మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదన్నారు. ఇటీవల తిర్యాణి పోలీసులు గ్రామాన్ని సందర్శించినప్పు డు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఎస్ఐ రామారావు దృష్టికి తెచ్చారన్నారు. దీంతో ఆయన స్పం దించి పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్ సంస్థ సహకారంతో 10 కుటుంబాలకు మూడు బల్బులతో కూ డిన 10 సోలార్ ల్యాంప్ సెట్లను అలాగే కాగజ్నగర్కు చెందిన యూత్ఫోర్స్ సోషల్ వెల్ఫేర్ సొసై టీ సహకారంతో రెండు సైకిళ్లను అందజేశామన్నారు. ఆదివాసుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అచ్చేశ్వరరావు, రెబ్బన సీఐ సతీశ్ కుమార్, తిర్యాణి ఎస్ఐ రామారావు,ట్రైనీ ఎస్ఐ సుగుణాకర్, సర్పంచ్ బొజ్జిరావు, సంస్థల ప్రతినిధులు కృష్ణకాంత్, శ్రీకాంత్, వసీం, జా వేద్, జలీల్, గ్రామస్తులు ఉన్నారు.