బీజింగ్: బడి పిల్లలకు హోం వర్క్, ప్రైవేట్ ట్యూషన్లు వద్దంటూ చైనా చట్టం చేసింది. ఈ సమయాన్ని పిల్లల వ్యాయామం, ఆటలు, విశ్రాంతి కోసం తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించింది. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యతను స్థానిక ప్రభుత్వాలకు అప్పజెప్పింది. తద్వారా పిల్లలపై ఒత్తిడిని, మితిమీరిన ఇంటర్నెట్ వినియోగాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నది. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను శిక్షించేలా ఇటీవల చైనా ముసాయిదాను రూపొందించింది. పిల్లలు ఆన్లైన్ గేమ్లకు బానిస కాకుండా వారంలో ఆరు గంటలే.. ఆడేలా గేమింగ్ కంపెనీలను ఆదేశించింది.