చికాగో: అమెరికాలోని చికాగోలో జూలై 4 పరేడ్ను టార్గెట్ చేస్తూ 22 ఏళ్ల దుండగుడు రాబర్ట్ క్రిమో కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇండిపెన్డెన్స్ డే పరేడ్పై జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. పరేడ్ జరుగుతున్న సమయంలో ఓ రూఫ్టాప్ నుంచి హైపవర్ రైఫిల్తో నిందితుడు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. పరేడ్కు వచ్చిన జనం కాల్పుల మోతతో పరుగులు తీశారు. సుమారు 30 మంది వరకు గాయాలపాలయ్యారు. కారులో చేజ్ చేసి మరీ నిందితుడు క్రిమోను పట్టుకున్నారు. అతని వద్ద ఆయుధాలు ఉన్నాయని, ప్రమాదకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్రిమో తన ప్రొఫైల్లో మ్యూజిషియన్ అని చెప్పుకున్నాడు.
309వ ఘటన..
ఇటీవల అమెరికాలో తుపాకీ సంస్కృతి విశృంఖలంగా మారింది. తుపాకులతో కాల్పులు జరుపుతున్న ఘటనలు పెరిగిపోయాయి. గన్ వాయిలెన్స్ ఆర్కీవ్ ప్రకారం.. ఈ ఏడాది ఆ దేశంలో ఇది 309వ సామూహిక కాల్పులు ఘటన. చికాగో ఘటన పట్ల అధ్యక్షుడు బైడెన్ షాక్ వ్యక్తం చేశారు. గన్ సంస్కృతిని అంతం చేసేందుకు పోరాటనున్నట్లు చెప్పారు. తుపాకీ నియంత్రణ బిల్లుపై ఇటీవల బైడెన్ సంతకం కూడా చేశారు.