కావలసిన వస్తువులు: బియ్యం: ఒక కప్పు, స్వీట్ కార్న్ గింజలు: అరకప్పు, పుదీనా తురుము: 1/4 కప్పు, పచ్చిమిర్చి: 4, పచ్చి బఠానీ: 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్: ఒకటి, లవంగాలు: 5, యాలకులు: 4, దాల్చిన చెక్క: చిన్న ముక్క, షాజీరా: ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టీస్పూన్, నూనె: ఒక టేబుల్ స్పూన్, నెయ్యి: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, ఉల్లిపాయ: ఒకటి
తయారీ విధానం: ముందుగా బియ్యం కడిగి పది నిమిషాలు నాన బెట్టాలి. స్టవ్మీద మందపాటి గిన్నె పెట్టి వేడయ్యాక నూనె, నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు పుదీనా ఆకులు, గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగాక కార్న్ గింజలు, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు వేసి.. మరో రెండు నిమిషాలు వేయించాలి. అన్నీ బాగా వేగాక, రెండు కప్పుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. అన్నం ఉడికి నీరంతా ఇగిరిపోయాక, మంట తగ్గించి మూతపెట్టి మరో మూడు నిమిషాలు మగ్గిస్తే సరి. స్వీట్కార్న్ పలావ్ రెడీ.