కేపీహెచ్బీ కాలనీ, జూన్ 12 : వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. కుండపోత వర్షాలు కురిసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. వర్షాకాలం విపత్తులను ఎదుర్కొనేందుకు అత్యవసర బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు కాలనీలు, బస్తీలు, సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టిని సారించారు. వరదనీటి కాలువలు, తరచుగా నీరు నిలిచే ప్రాంతాలలో ముందస్తు చర్యలను చేపట్టారు. వర్షాలతో తలెత్తనున్న సమస్యలన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
వర్షాలతో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేలా వార్డుకొక అత్యవసర బృందాన్ని సిద్ధం చేశారు. కూకట్పల్లి జోన్లోని ఐదు సర్కిళ్లలో 22 వార్డులకు గాను 22 బృం దాలు.. 24 గంటలు అందుబాటులో ఉండి అత్యవసర సేవలందించనున్నారు. వార్డుకొకటి చొప్పున ప్రత్యేక వాహనం అందులో ఎనిమిది మంది సిబ్బంది రెండు షిఫ్టులుగా పనిచేయాల్సి ఉం టుంది. జోన్లోని 22 వార్డులలో 176 మంది సిబ్బంది అత్యవసర సేవలు అందించనున్నారు. అలాగే ప్రతి సర్కిల్కు ఒక జేసీబీ వాహనం, 200 కెపాసిటీ గల ఇటాచి వాహనం అందుబాటులో ఉంటుంది. ఎమర్జెన్సీ వాహనంలో నీటినితోడే పంపుసెట్టు, ట్రీ కటింగ్ మిషన్లు, గడ్డపార, తట్ట లాంటి పరికరాలు ఉంటాయి. రోడ్లపై గుంతలను తక్షణమే పూడ్చేందుకు కాంక్రిట్, డస్ట్ మిశ్రమాన్ని వాహనంతో పాటు అందుబాటులో ఉంచుతారు.
వర్షాలతో ఇబ్బందులు ఏర్పడినప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తారు. సర్కిళ్ల వారీ గా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. డివిజన్ల వారీగా అధికారుల పర్యవేక్షణలో అత్యవసర బృం దాలు పనిచేయాల్సి ఉం టుంది. జూన్ నుంచి అక్టోబర్ చివరి వరకు ఈ బృం దాలు అందుబాటులో ఉంటా యి. వర్షాలులేని సమయంలో నాలాలలో చెత్తచెదారం, మట్టిన తొలగించడం, హరితహారంలో మొక్క లు నాటేందుకు పనిచేయాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో విపత్తులను ఎదుర్కొనేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది భారీ వర్షాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జోన్లోని వార్డుల వారీగా ఎమర్జెన్నీ టీమ్ లను సిద్ధం చేశాం. వర్షాకాలానికి ముందే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నాం.
-వి.మమత, జడ్సీ, కూకట్పల్లి