మెదక్రూరల్, మే 3: కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ లక్ష్మీ ఆంజనేయులు అన్నారు. సోమవారం తిమ్మనగర్ గ్రామంలో హ్తెపోక్లోరెట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని ,అవసరమైతే తప్ప ఇండ్లనుంచి బయటకు రావద్దన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు మాస్క్ల అందజేత
సానీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో బి.తిమ్మాయిపల్లిలో ఉపాధి హామీ కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్లు లయన్స్క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ చైర్మన్ విజయ్కుమార్శెట్టి అందజేశారు. కార్యక్రమంలోసర్పంచ్ రాజు, సానీక్ష సభ్యులు యూత్ డైరెక్టర్ భూషణ్, లియో రంజిత్కుమార్, శ్రీకాంత్, మధు, సెక్రటరీ నవీన్, బాలకృష్ణ, సానీక్ష ఫౌండేషన్ సభ్యులు భూషన్, రంజిత్కుమార్, శ్రీకాం త్, మధు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో…
ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని టీఆర్ఎస్ నాయకుడు యాదవరావు సూచించారు. మండల పరిధిలోని గవ్వలపల్లిలో ఆయన ఉపాధిహామీ కూలీలకు మాస్క్లను అందజేశారు