ముంబై ,జూన్ 2: భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ప్రొడక్టివ్ డెవలప్ మెంటు తాలూకు మైనింగ్ పాలిసీ సెక్రటేరియట్ కు మధ్య అవగాహన ఒప్పంద పత్రం (ఎమ్ఓయూ) కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఖనిజ వనరుల రంగం లో సహకారానికి ,సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఎమ్ఓయూ మార్గాన్నిసుగమం చేస్తుంది.
లిథియమ్ గనుల తవ్వకం, వాటి తాలూకు లబ్ధి ని పొందడం సహా ఖనిజ వనరుల అన్వేషణ ను, అభివృద్ధి ని, ఖనిజ నిక్షేపాల వెలికితీతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన సహకారం.మౌలిక లోహాలు,వ్యూహాత్మకఖనిజాలరంగంలోఒకసంయుక్తసంస్థనుఏర్పాటుచేసేందుకుఅవకాశాలనుపరిశీలించడం,సాంకేతికపరమైనటువంటి, విజ్ఞాన శాస్త్రపరమైన సమాచారాన్ని అందించుకోవడంతో పాటు ఆలోచనలను, జ్ఞానాన్ని పరస్పరం ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం, శిక్షణ, సామర్థ్యాల పెంపుదల వంటివన్నీ ఈ ఎమ్ఒయు ఉద్దేశ్యాలలో భాగంగా ఉన్నాయి. గనుల తవ్వకం సంబంధి కార్యకలాపాల లో పెట్టుబడిని, అభివృద్ధి ని ప్రోత్సహించడం నూతన ఆవిష్కరణల లక్షాన్ని సాధించడంలో ఈ ఒప్పందంతోడ్పడగలుగుతుంది.