రఘునాథపాలెం, ఏప్రిల్ 13: ఖమ్మం నగరం 12వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ చిరుమామిళ్ల నాగేశ్వరరావు, ఎలినేని రమణలు మరో 90 కుటుంబాల వారితో మంగళవారం గులాబీ గూటికి చేరారు. వీరికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.